- అనారోగ్య బాధితులకు ఆర్థికంగా ఆదుకుంటున్న ప్రజాప్రభుత్వం
- మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పానుగంటి నరసింహారెడ్డి
నాగారం, అక్షిత న్యూస్ : అనారోగ్య బాధితులకు ఆర్థికంగా ఆదుకుంటున్న ప్రజా ప్రభుత్వం అని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పానుగంటి నరసింహారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా శనివారం మండల పరిధిలోని ఫణిగిరి గ్రామానికి చెందిన ఆకారపు రాములమ్మ భర్త వెంకటయ్య గత కొంతకాలం నుండి అనారోగ్యం కారణంగా హైదరాబాదులోని నిమ్స్ హాస్పటల్లో చికిత్స పొందడంతో ఆర్థిక ఇబ్బందులకుగురై బాధిత కుటుంబం నిస్సహస్థితిలో ఉండడంతో, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన ప్రజా ప్రభుత్వం, తుంగతుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు మందుల సామేలు ఆధ్వర్యంలో ప్రభుత్వపరంగా ఎల్ఓసి అమౌంటు ₹2,00,000/- రూపాయలు మంజూరు కాగా ఎమ్మెల్యే ఆదేశాల మేరకు సంబంధిత బాధిత కుటుంబానికి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పానుగంటి నరసింహారెడ్డి నాయకత్వంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాంరెడ్డి నేతృత్వంలో ఎల్ఓసి ని అందజేశారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు నాతి వీరమల్లు, నాతి వెంకన్న, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు మందుల వెంకన్న,విద్యాసాగర్ రెడ్డి, వల్లాల రామయ్య, వల్లాల భాను,జంపాల రవీందర్, తదితరులు పాల్గొన్నారు.