నిజాయితీకి నిదర్శనం సెక్యూరిటీ సిబ్బంది

 

మరిచిపోయిన మొబైల్‌ను భక్తునికి అప్పగింపు

యాదాద్రి భువనగిరి అక్షిత బ్యూరో 

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి దర్శనార్థం వచ్చిన హైదరాబాద్‌కు చెందిన మహేష్ తన మొబైల్ ఫోన్‌ను కొండపై బస్‌స్టాప్ వద్ద మరిచిపోయాడుఅక్కడే విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ సిబ్బంది శేఖర్ ఆ ఫోన్‌ను గుర్తించి, మైక్ ద్వారా ప్రకటన చేయించి భక్తుని వివరాలు సేకరించారు. అనంతరం మొబైల్ ఫోన్‌ను మహేష్‌కు సురక్షితంగా అప్పగించారు. తన మొబైల్ తిరిగి లభించడంతో భక్తుడు ఆనందం వ్యక్తం చేస్తూ సెక్యూరిటీ సిబ్బంది శేఖర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, ఎస్వీఎఫ్ సిబ్బంది, సహచరులు, భక్తులు శేఖర్ నిజాయితీని అభినందించారు.


 

Leave A Reply

Your email address will not be published.

Breaking