ప్రజల సౌకర్యార్థం కరీంనగర్ సిటీ బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్
కరీంనగర్ అక్షిత బ్యూరో
కరీంనగర్ ప్రజల సౌకర్యం కోసం రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, చొప్పదండి శాసనసభ్యులు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డా. మేడిపల్లి సత్యం, మానకొండూర్ శాసనసభ్యులు, డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ కోలగాని శ్రీనివాస్ తో కలిసి నగరంలోని కరీంనగర్ నుండి చింతకుంట, కొత్తపెళ్లి హవేలీ, తిమ్మాపూర్ లోని వాగేశ్వరి కాలేజ్ వరకు నూతన సిటీ బస్ సర్వీస్ లను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఆర్టిసి ఎండి నాగిరెడ్డి, జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌస్ అలాం, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ కుమార్ దేశాయ్, లతోపాటు మున్నూరు రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్, ఆర్టిఏ మెంబర్ పడాల రాహుల్ గౌడ్, ఏఎంసీ చైర్మన్ ఆకుల నరసయ్య, సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మల్లికార్జున రాజేందర్, గడ్డం విలాస్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.