హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయను మర్యాద పూర్వకంగా కలసిన ఇబ్రహీంపట్నం అసెంబ్లీ కన్వీనర్ నాయిని సత్యనారాయణ
ఇబ్రహీంపట్నం, అక్షిత ప్రతినిధి :
శనివారం రోజు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ని , చండీగఢ్ రాజభవన్ లోమర్యాద పూర్వకంగా కలసి , సన్మానం చేసిన ,ఇబ్రహీంపట్నం బీజేపీ అసెంబ్లీ కన్వీనర్,కౌన్సిలర్ నాయిని సత్యనారాయణ.ఈ సందర్బంగా బండారు దత్తాత్రేయ నియోజకవర్గ నాయకుల క్షేమ సమాచారం అడిగి ,పార్టీ స్థితిగతుల విషయాలు చర్చించి ,సత్యనారాయణ చేస్తున్న సామజిక సేవలను అభినందించి ,నిత్యం ప్రజలకు ,కార్యకర్తలకు అందుబాటు లో ఉంటూ పార్టీని బలోపేతం చేయాలనీ సూచిస్తూ ,వచ్చిన నాయకులకు అల్పాహారవిందుఏర్పాటు చేసి వారితో కలసి విందు లో పాల్గొన్నారు .ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు గోపాల్ రెడ్డి ,వేణుమాధవ్ ,శ్రీకాంత్, ,నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.