బండి సంజయ్ ని కలిసిన సుజాతరెడ్డి
కరీంనగర్ అక్షిత బ్యూరో
బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు పోతుగంటి సుజాత రెడ్డి మంగళవారం కరీంనగర్లోని ఎంపీ కార్యాలయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, బండి సంజయ్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా రాష్ట్రంలో పార్టీ బలోపేతం, ప్రజా సమస్యల పరిష్కారం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, అలాగే భవిష్యత్ రాజకీయ, సంస్థాగత కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. బండి సంజయ్ కుమార్ నాయకత్వంలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ మరింత బలోపేతం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేసిన సుజాత రెడ్డి , పార్టీ అభివృద్ధి, ప్రజా సేవా కార్యక్రమాలకు తమ పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.