*తెలంగాణలో విద్యా సంస్థలకు మరో మూడు రోజులు సెలవులు పొడిగింపు*.
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి:
రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణలోని విద్యాసంస్థలకు మరో మూడు రోజుల పాటు సెలవులు పొడిగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత సోమవారం నుంచి నేటి వరకు సెలవులు ప్రకటించిన విషయం విదితమే. అయితే వర్షాలు తగ్గుముఖం పట్టకపోవడంతో.. మరో మూడు రోజుల పాటు సెలవులను పొడిగించారు. సోమవారం నుంచి విద్యాసంస్థలు పునఃప్రారంభం కానున్నాయి. ఇక ఎంసెట్ అగ్రికల్చర్ ప్రవేశ పరీక్షను రాష్ట్ర ఉన్నత విద్యామండలి వాయిదా వేసిన సంగతి తెలిసిందే.