*ఎన్ ఎస్ ఆర్ యూ సాగర్ నియోజకవర్గ అధ్యక్షులుగా నూతికుర్తి (ఉంగరాల) శ్రీనివాస్ నియామకం*
అక్షిత ప్రతినిధి, నాగార్జునసాగర్ :
జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సమితి ఫోరమ్ జాతీయ వవ్యవస్థాపక అధ్యక్షులు టీ యసురామచంద్ర నాయుడు ద్వారా నల్లగొండ జిల్లా వర్కింగ్ ప్రేసిడెంట్ పాతనబోయిన సంతోష్ కుమార్ చేతుల మీదుగా నాగార్జున సాగర్ నియోజకవర్గ అధ్యక్షులుగా నూతికుర్తి (ఉంగరాల) శ్రీనివాస్ నియమించబడినారు . ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో నన్ను నాగార్జున సాగర్ నియోజకవర్గ అధ్యక్షులుగా నియమించిన జాతీయ అధ్యక్షులు , నల్లగొండ కార్యనిర్వాహక అధ్యక్షులు మరియు ఇట్టి నియమకంనకు సహకరిరించిన కమిటీ సభ్యులకు కృతజ్ఞలు తెలియచేసారు . తనపై ఉంచిన బాధ్యతను శక్తివంచన లేకుండా , అధికార దుర్వినియోగం చేయకుండా సక్రమంగా నిర్వర్తిస్తానని తెలియ చేశారు . అన్యాయం జరిగిన వారికి అండగా నిలబడి వారికి న్యాయం జరిగేలా ప్రయథ్నించటం,మన పర్యావరణ పరిరక్షణకు మన వంతు మనం సమిధ గా మారటం., ప్రతి ఒక్కరి తో సవ్యంగా నడుచుకుంటూ సర్వ సమానత్వం చూపిస్తూ మన చుట్టూ పక్కల వాయికి దిక్సూచి గా మారటం, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవటం, అన్యాయాన్ని నిలదీయగల శక్తిగా ఆయుధం గా మారటం, సామాజిక అసమానతలు ను నిరసిస్తూ సర్వ మానవాళి కి సమాన స్వేచ్ఛ, హక్కులు అందేలా కృషి చేస్తానని తెలియచేసారు.