బండారి ప్రకాష్ గౌడ్ విగ్రహాన్ని మాయం చేసిన వారిపై చర్యలు తీసుకోండి
యుగంధర్ రెడ్డి
కూకట్ పల్లి, అక్షిత ప్రతినిధి:
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాలనగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు బండారి ప్రకాష్ గౌడ్ విగ్రహాన్ని మాయం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఏం యుగంధర్ రెడ్డి డిమాండ్ చేశారు. బాలానగర్లో గల బండారి ప్రకాష్ గౌడ్ విగ్రహాన్ని శనివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసి మాయం చేయడానికి తీవ్రంగా ఖండించారు. విగ్రహాన్ని మాయం చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకునే వరకు కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తూనే ఉంటుందని యుగంధర్ రెడ్డి తెలియజేశారు.