నాంపల్లి మండల బీఎస్పీ ఉపాధ్యక్షునిగా మహేందర్ ముదిరాజ్
నాంపల్లి, అక్షిత న్యూస్: బహుజన్ సమాజ్ పార్టీ నాంపల్లి మండల అధ్యక్షుడు పల్లేటి వినోద్ కుమార్ అద్వర్యంలో నేరళ్లపల్లి గ్రామానికి చెందిన జిల్లగోని మహేందర్ ముదిరాజ్ ని నాంపల్లి మండల ఉపాద్యక్షునిగా నియోజకవర్గ కమిటీ ఆదేశాల మేరకు ఎన్నుకోవడం జరిగింది
మునుగోడు ఉప ఎన్నికలకంటే ముందు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ సమక్షంలో బహుజన్ సమాజ్ పార్టీలో చేరిన మహేందర్ , మహానీయుల అడుగు జాడల్లో నడుస్తానని,ప్రజా సమస్యలపై పోరాట ప్రతిమను కనుబరచి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని, దొరల పాలన అంతం చేయడమే లక్ష్యమని, రానున్న రోజుల్లో బహుజనులదే రాజ్యం అని ఈ సందర్భంగా తెలియచేశారు. ఈ కార్యక్రమంలో గోదాసి వెంకులు, వెంకటయ్య, రమేష్, గిరి, తదితరులు పాల్గొన్నారు.