ప్రత్యేక పూజలో పాల్గొన్న తూము వినయ్ కుమార్
కూకట్ పల్లి, అక్షిత ప్రతినిధి :
హనుమాన్ భక్తులకు అష్టైశ్వర్యాలు కల్గుతాయి.
హనుమాన్ జయంతి పురస్కరించుకొని గురువారం కూకట్ పల్లి నియోజకవర్గం భరత్ నగర్ లోని శివసేన యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వీర హనుమాన్ ప్రాంగణం వద్ద ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించిన టిట సెక్రటరీ తూము వినయ్ కుమార్. ఈ సందర్భంగా వినయ్ కుమార్ మాట్లాడుతూ వీర హనుమాన్ పూజించే భక్తులు ఎప్పుడూ ఎలాంటి కష్టాల బారిన పడకుండా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో శివసేన యూత్ అసోసియేషన్ సభ్యులు పవన్, పల్లి పవన్, బాలు, కుమార్, మహేష్, పవన్, లీడర్ బాబు, బట్కరి శివ, మహేష్, తదితరులు పాల్గొన్నారు.