టిపిసిసి ధర్నాలో పాల్గొన్న యుగంధర్ రెడ్డి.
కూకట్ పల్లి, అక్షిత ప్రతినిధి:
పోటీ పరీక్షల నిర్వహణ బాధ్యతను నిర్వర్తించే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో జరిగే అవకతవకలను నిరసిస్తూ తేదీ:18-04-2023 మంగళవారం రోజున టిపిసిసి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ ధర్నా చౌక్ దగ్గర అఖిలపక్ష పార్టీల ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూకట్ పల్లి నియోజకవర్గ ఏ.బ్లాక్ ఉపాధ్యక్షుడు మాదిరెడ్డి యుగంధర్ రెడ్డి, ఈ సందర్భంగా యుగంధర్ రెడ్డి మాట్లాడుతూ నీళ్లు, నిధులు ,నియామకాలతో, ఏర్పడ్డ తెలంగాణ ప్రభుత్వం నియమాకల విషయంలో నిరుద్యోగ యువతతో చెలగాటం ఆడొద్దు అన్నారు.ఈ కార్యక్రమంలో బాలానగర్ డివిజన్ ఉపాధ్యక్షుడు ఆకుల నరేందర్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ధర్నాను విజయవంతం చేశారు.