అంగరంగ వైభవంగా బోనాలు

హనుమాన్ నగర్ లో అంగరంగ వైభవంగా బోనాల పండుగ

కూకట్ పల్లి, అక్షిత ప్రతినిధి:
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతికలు అయినా బోనాల పండుగ పురస్కరించుకొని ఆషాడ మాసం చివరి ఆదివారం హనుమాన్ నగర్ లోని శ్రీ శ్రీ శ్రీ నల్ల పోచమ్మ తల్లి ఆలయంలో ఆలయ కమిటీ ఆహ్వాన మేరకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రభుత్వ విప్పుఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, పెద్ద భాస్కర్ రావు, చంద్రకాంతరావు, కాంగ్రెస్ నాయకులు రఘునాథ యాదవ్, జగద్గిరిగుట్ట సెక్టార్ ఎస్సై సత్యం, అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ బిఆర్ఎస్ నాయకులు టీ, నర్సింలు, టైల్స్ శ్రీనివాస్, పరమేష్ గౌడ్, రామ్ రెడ్డి, ఎర్రన్న, సంగమేష్,రాములు,నర్సిమ్మ చారి,నారాయణ, కాలనీవాసులు, భక్తులు, మహిళలు, పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking