విజయ భవానిని పరామర్శించిన వడ్డేపల్లి
కూకట్ పల్లి, అక్షిత ప్రతినిధి :
మేడ్చల్ జిల్లా (అర్బన్) బిజెపి మహిళ మోర్చా ప్రధాన కార్యదర్శి డాక్టర్ విజయ భవాని డెంగ్యూ జ్వరంతో బాధపడుతూ చికిత్స నిమిత్తం కూకట్ పల్లి లోనీ ఒమిని హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యి చికిత్స పొందుతున్నారు, ఆదివారం స్థానిక కార్యకర్తల ద్వారా విషయం తెలుసుకున్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు
వడ్డేపల్లి రాజేశ్వరరావు ఓమిని హాస్పిటల్ కు చేరుకొని విజయ భవాని ని పరామర్శించారు ,భవాని ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకుని సరైన చికిత్స అందించి త్వరగా కోలుకునేల చూడాలని తెలియజేశారు.