మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు
మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
వినాయక చవితి పండుగ సందర్భంగా మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలకు బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు, మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ శుభాకాంక్షలు తెలిపారు. గణాలకు అధిపతి అయిన ప్రథమ దేవుడు వినాయకుడిని పూజించే వినాయక చవితి పర్వదినం హిందువులకు ఎంతో పవిత్రమైనదని అన్నారు. ‘వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ. నిర్విఘ్నం కురుమేదేవ సర్వేకార్యేషు సర్వదా’ అంటూ శుభం కలుగాలని ఏకదంతున్ని భక్తులు ఆరాధిస్తారని తెలిపారు. శాంతి, సౌభ్రాతృత్వం వెల్లివిరిసేలా ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలలో భక్తి శ్రద్ధలతో పాల్గొంటు ప్రజలందరూ ఐకమత్యంతో, ఆనందంతో గణపతి నవరాత్రులను జరుపుకోవాలని ఆయన సూచించారు. గణనాథుడి ఆశీస్సులతో అనేక విఘ్నాలు అధిగమిస్తూ మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు పాలనలో మిర్యాలగూడ నియోజకవర్గం సుభిక్షంగా ఉన్నదని, అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతూ ఇతర నియోజకవర్గాలకు ఆదర్శంగా నిలుస్తున్నదని అన్నారు. ప్రభుత్వం చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలు లంబోధరుడి ఆశీస్సులతో నిర్విఘ్నంగా కొనసాగాలని మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలు సుఖశాంతులతో ఆనందంగా ఉండేలా దీవెనలు అందివ్వాలని విఘ్నేశ్వరుని ప్రార్థించనున్నట్టు తిరునగర్ భార్గవ్ తెలిపారు.