సీఐ సత్యనారాయణ కుటుంబ సభ్యులకు భాస్కర్ రావు పరామర్శ

సీఐ సత్యనారాయణ కుటుంబ సభ్యులకు ఎమ్ఎల్ఏ భాస్కర్ రావు పరామర్శ

గరిడేపల్లి, అక్షిత న్యూస్ :

మిర్యాలగూడ రూరల్ సీఐ ముత్తినేని సత్యనారాయణ తండ్రి లక్ష్మీనర్సయ్య అనారోగ్య సమస్యతో ఇటీవల మృతి చెందారు. స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు సీఐ స్వగ్రామమైన గరిడేపల్లి మండలంలో రామచంద్రపురం గ్రామంలోని నివాసానికి వెళ్లి లక్ష్మీ నర్సయ్య చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం సీఐ సత్యనారాయణ కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం కల్పించారు. ఎమ్ఎల్ఏ తో పాటు నల్లగొండ జిల్లా రైతు బంధు అధ్యక్షులు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, వైస్ ఎంపీపీ అమరావతి సైదులు, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మట్టపల్లి సైదులు,సర్పంచ్ రవి నాయక్, బీఆర్ఎస్ నాయకులు పులి జగదీష్,వేణు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking