నాగోల్ గౌడ్ సంఘం ఆత్మీయ సభ
ముఖ్యఅతిథిగా పాల్గొన్న
ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవి రెడ్డి సుధీర్ రెడ్డి
ఎల్బీనగర్, అక్షిత ప్రతినిధి
నాగోల్ గౌడ సంఘం నందు చెరుకు ప్రశాంత్ గౌడ్ ఆధ్వర్యంలో బుదవారం నిర్వహించిన గౌడ కులస్తుల ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఈ సందర్భంగా గౌడ కులస్తులు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో సుధీర్ రెడ్డి కి మా యొక్క మద్దతు తప్పకుండా ఉంటుంది అని తెలిపారు. వారిని అఖండ మెజారిటీతో గెలుపించుకుంటామని తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో ఎమ్మెల్సీలు ఎగ్గే మల్లేశం ,దయనంద్ గుప్తా పలువురు గౌడ సంఘ పెద్దలు,సభ్యులు పాల్గొన్నారు.