మన తెలంగాణ పూలను ఆరాధ్య దైవంగా పూజించాలి
ప్రిన్సిపాల్ మంగరాజ్
మద్దూరు అక్షిత న్యూస్:
మద్దూరు మండల కేంద్రములోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా బతుకమ్మ పండుగను నిర్వహించుకున్నారు.ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ మంగరాజ్ కొబ్బరి కాయ కొట్టి బతుకమ్మ పండుగను ప్రారంబించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ అందరు ఓకే చోట కూడి ఆడుకొనే ఏకైక పండుగ బతుకమ్మ పండుగ అన్నారు. అందుకే తెలంగాణలోని పూలను ఆరాధ్య దైవంగా భావించి పూజించాలని విద్యార్థులకు సూచించారు.ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు,విద్యార్థులు పాల్గొన్నారు.