ఎంపీ వద్దిరాజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో కలిసి లంచ్
భూపాలపల్లి, అక్షిత ప్రతినిధి :
రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ.రామారావు, లోకసభలో బీఆర్ఎస్ పక్ష నేత నామ నాగేశ్వరరావు, మాజీ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, ఎంపీలు కే.ఆర్.సురేష్ రెడ్డి,బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావులతో కలిసి భూపాలపల్లిలో లంచ్ చేశారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు మేడిగడ్డ ప్రాజెక్ట్ సందర్శనకు వెడుతూ మార్గమధ్యంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆహ్వానం మేరకు భూపాలపల్లిలో కొద్దిసేపు ఆగి లంచ్ చేశారు.