ఆంజనేయ స్వామి దేవాలయంలో శివలింగం ప్రతిష్టాపన గ్రామంలో నూతన శివాలయ నిర్మాణానికి దాతగా నిలవనున్న
కునూరు సాయికుమార్ గౌడ్ ప్రముఖ పారిశ్రామికవేత్త
నకిరేకల్, అక్షిత ప్రతినిధి :
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం పోగారం గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో కాశీ నుండి గ్రామానికి తీసుకొచ్చినటువంటి శివలింగాన్ని ఆలయంలో ప్రతిష్టాపన చేయడానికి అదేవిధంగా గ్రామ ప్రజల సుభిక్షంగా పాడి పంటలతో ఆయురారోగ్యాలతో ఉండాలనే సహృదయంతో గ్రామములో నూతన శివాలయ నిర్మాణానికి నేనున్నానంటూ ప్రజలందరి సహకారంతోముందడుగు వేయడానికి సిద్ధమేనని ఈ సందర్భంగా అన్నారు వీరి వెంట పాల్గొన్నవారు కునూరు రాజు. వనం శంకరయ్య కడారి లక్ష్మణ్ జేల్లా శ్రీనివాస్. ఆంజనేయస్వామి ఆలయ పూజారి నిత్యానందం ఆలయ వాచ్మెన్ బదుల శంకరయ్య ఎస్.కె మోహిన్ తదితరులు పాల్గొన్నారు.