ఆమనగల్లు జాతరకు సర్వం సిద్ధం

అంగరంగ వైభవంగా ఆమనగల్లు జాతర 
– చైర్మన్ తాళ్ల వెంకటేశ్వర్లు
వేములపల్లి, అక్షిత ప్రతినిధి:
మండలంలోని ఆమనగల్లు గ్రామంలోని కాకతీయుల కాలం నుంచి ప్రసిద్ధి గాంచిన శ్రీశ్రీశ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఈ నెల 23 నుండి 26 వరకు నిర్వహించనున్న జాతర మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్నట్లు ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ తాళ్ల వెంకటేశ్వర్లు తెలిపారు. జాతర సందర్బంగా ఈనెల 25న గ్రామానికి చెందిన కీర్తిశేషులు కొప్పర మంగమ్మ-కోటయ్య ముదిరాజ్ ల జ్ఞాపకార్థం వారి కుమారులు కొప్పర అరుణ-వెంకటనర్సయ్య ముదిరాజ్, కోప్పర శోభారాణి-లక్ష్మయ్యముదిరాజ్, లు 3వ రోజు అన్నదానం చేసేందుకు ముందుకు రావడం జరిగిందన్నారు.

అదేవిధంగా జాతర సందర్బంగా నిర్వహించనున్న కబడ్డీపోటీలో గెలుపొందిన విజేతలకు తృతీయబహుమతి అందించేందుకు గ్రామానికి చెందిన మెరుగు అమ్రాము జ్ఞాపకార్థము అతనిసతీమణి మెరుగుఅనిత రూ.40వేలు నగదు అందజేసినట్లు చైర్మన్, తాళ్లవెంకటేశ్వర్లు తెలిపారు. దాతల కుటుంబాలకు శ్రీశ్రీశ్రీపార్వతి రామలింగేశ్వరస్వామి ఆశీస్సులు సదా వెన్నంటి ఉండాలని ఆకాంక్షించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking