నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
అసిస్టెంట్ ఇంజనీర్ శ్రీను నాయక్
అడవిదేవులపల్లి,అక్షిత ప్రతినిధి:-
అడవిదేవులపల్లి మండల పరిధిలో 11కేవీ లైన్ల లో చెట్లు తొలగించే కార్యక్రమం ఉన్నందున 33/11కేవీ ఉల్సాయి పాలెం సబ్ స్టేషన్ ల పరిధిలో అడవిదేవులపల్లి ముదిమాణిక్యం, సత్రశాల, ఉల్సా పాలెం, బంగారిగడ్డ, ఇంద్రానగర్, తాటి చెట్టు తండా, చాంప్లా వస్త్రం తండా, జీలకర్ర కుంట తండా, హాము తండా గ్రామాలకు ఆదివారం మార్చి 24 వ తారీకు నాడు ఉదయం 8గంటల నుండి 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడును.
కావున కరెంటు గృహ వినియోగదారులు,మరియు వాణిజ్య వినియోగదారులు,రైతులు విద్యుత్ సిబ్బందికి మరియు అధికారులకు సహకరించి మీకు కలిగిన అంతరాయమునకు సహకరించగలరని అసిస్టెంట్ ఇంజనీర్ లావూడి శీను నాయక్ తెలిపారు.