వర్షాకాల ముందస్తు జాగ్రత్తలపై సమీక్ష సమావేశం..

వర్షాకాల ముందస్తు జాగ్రత్తలపై సమీక్ష సమావేశం..

మేడ్చల్, అక్షిత బ్యూరో : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు దుండిగల్ పురపాలక కార్యాలయం లోనే సమావేశ. రాబోయే వర్షాకాలంలో వరదలు, పారిశుద్ధ్యం నిర్వహణ, సీజనల్ వ్యాధులు నివారణ, కంట్రోల్ రూమ్ ఏర్పాటు అవసరమైన మిషనరీతో కూడిన అత్యవసర యంత్రాంగం ఏర్పాటు మున్సిపాలిటీచే చేపట్టబడు ముందస్తు చర్యలు మొదలగు అంశాలపై మున్సిపల్ కమిషనర్ కే సత్యనారాయణ రావు ఇంజనీరింగ్ విభాగం శానిటేషన్ విభాగం సిబ్బంది వార్డ్ ఆఫీసర్లతో సుదీర్ఘ సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది.

వర్షాకాలంలో ఏవైనా అత్యవసరమైన సమస్యలు ఏర్పడితే పరిష్కరించుటకు ప్రజలకు అనుకూలంగా ఉండేందుకు 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా మున్సిపాలిటీలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని పట్టణ ప్రజలు ఇట్టి కంట్రోల్ రూమ్ కు సమస్యలపై వెంటనే కంట్రోల్ రూమ్ మొబైల్ నెంబర్ 9542715377 కు సమాచారం అందించ వలసిందిగా కమిషనర్ తెలిపారు.ఇట్టి కార్యక్రమంలో మున్సిపల్ ఏఈ ప్రవీణ్ కుమార్ మేనేజర్ నర్సింలు సానిటరీ ఇన్స్పెక్టర్ అంజయ్య, వార్డ్ ఆఫీసర్లు శానిటరీ జవాన్లు తదితర మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking