నిజాయితీగా
పనిచేస్తే తోడుంటా
డంపింగ్ యార్డు
ఆకస్మిక తనిఖీ
ఎమ్మెల్యే బిఎల్ఆర్
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
మిర్యాలగూడ పట్టణంలో చెత్తని సేకరించే మున్సిపల్ వాహనాలు సరిగా రావడం లేదని ప్రజల ఫిర్యాదుల మేరకు పట్టణంలోని మున్సిపల్ డంపింగ్ యార్డ్ ను మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి బిఎల్ఆర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
డంపింగ్ యార్డ్ లో చెత్త సేకరించే వాహనాల రిజిస్టర్ పరిశీలించి వాహనాల వివరాలు, ఎన్ని ట్రిప్పులు తిరుగుతున్నాయనే వివరాల్లో కూడా లొసుగులు ఉంటున్నాయని ఫిర్యాదుల వస్తున్నాయని ప్రతీ వాహనం రిడింగ్ కూడా ప్రతీ రోజు రిజిస్టర్ లో ఉంచాలని అక్కడి సిబ్బందికి సూచించారు.
అనంతరం డంపింగ్ యార్డ్ అంతా తిరిగి చూసి అక్కడ పనులు సరిగా లేవని మున్సిపల్ ఇన్చార్జికి కాల్ చేసి ఖచ్చితంగా డంపింగ్ యార్డ్ సందర్శించి వాహనాల వివరాలు, ఇక్కడ పరిసరాలు ఎలా ఉన్నాయని ఎప్పటికప్పుడు పరిశీలించాలని కోరారు. అనంతరం వాహనాల డ్రైవర్స్ తో ఆయన మాట్లాడుతూ చేసే ఉద్యోగం నాయకుల కోసం నాయకులకు భయపడుతూ చేయకండి ప్రజల కోసం పని చేయండి నిజాయతీగా పని చేస్తే తోడుగా ఉంటానని సమస్యలు ఏమున్నా పరిష్కరిస్తానన్నారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ కు కాల్ చేసి డంపింగ్ యార్డ్ లోకి వాహనాలు వెళ్ళే దారి సరిగా లేదని వెంటనే సాయంత్రం వరకు మున్సిపల్ డోజర్స్ తో చెత్తని ఒక దగ్గర చేసి దారిని చేయాలని సూచించారు. మిర్యాలగూడ పట్టణాన్ని ఉత్తమ పారిశుధ్య పట్టణంగా తీర్చి దిద్దాలని నేను ప్రయత్నం చేస్తున్నాని దానికి అధికారులు, కార్మికులు, ప్రజలు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.