అన్ని సంక్షేమ హాస్టళ్లలో కామన్ డైయిట్ ప్లాన్

 

*రాష్ట్ర వ్యాప్తంగా నేడు (శనివారం) అన్ని సంక్షేమ హాస్టళ్లలో కామన్ డైయిట్ ప్లాన్ ప్రారంభం*

*రాష్ట్ర ముఖ్యమంత్రి, డిప్యూటీ సి.ఎం తోసహా మంత్రులు, అధికారులచే కామన్ డైట్ ప్లాన్ ప్రారంభం*

*గత పదేళ్లలో మొదటిసారిగా, సంక్షేమ హాస్టళ్ల చరిత్రలో తొలిసారి డైయిట్ చార్జీలను 40 శాతం, కాస్మోటిక్ చార్జీలు 200% పెంచే విప్లవాత్మక నిర్ణయం*

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

రాష్ట్రంలోని అన్ని సంక్షేమ హాస్టల్లో ఒకే విధమైన డైట్ ప్లాన్ ను రేపు, శనివారం నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో సహా రాష్ట్ర మంత్రులు, సీనియర్ ఐఏఎస్ , ఐపీఎస్ అధికారులు, జిల్లా కలెక్టర్లు ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో *గత పదేళ్లలో మొదటిసారిగా, సంక్షేమ హాస్టళ్ల చరిత్రలో మరెన్నడూ లేని విధంగా డైయిట్ చార్జీలను 40 శాతం, కాస్మోటిక్ చార్జీలు 200% పెంచుతూ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం* తీసుకున్న విషయం విదితమే. ఈ పెంచిన డైట్ ఛార్జీలలో భాగంగా రాష్ట్రంలోని ఎస్.సి, ఎస్.టి. బీసీ, మైనారిటీ సంక్షేమ హాస్టల్లో శనివారం నాడు ఒకే సారి కామన్ డైట్ విధానాన్ని ప్రజా ప్రతినిధులు, సీనియర్ అధికారుల సమక్షంలో ప్రారంభించనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి లతో సహా రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తో పాటు సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్, ఐ.ఎఫ్.ఎస్ అధికారులు, ఇతర ప్రజా ప్రతినిధులు గురుకుల, రెసిడెన్షియల్ హాస్టళ్లను రేపు శనివారం నాడు వ్యక్తిగతంగా సందర్శించి, అక్కడే విద్యార్ధులతో కలసి భోజనం చేసి పరిస్థితులను స్వయంగా అంచనా వేయనున్నారు.
రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకుల హాస్టళ్లలోని దాదాపు 8 లక్షల మంది విద్యార్థులకు గతంలో మరెన్నడూ లేని విధంగా డైట్ చార్జీలు 40%, కాస్మోటిక్ చార్జీలు 200% పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు రాష్ట్రంలోని పాఠశాలలో 667.25 కోట్లతో మౌలిక సదుపాయాలను కూడా ప్రభుత్వం కల్పించింది. హాస్టల్ల పనితీరును నిరంతరం పర్యేవేక్షించేందుకు ఆకునూరి మురళి అధ్యక్షతన స్టేట్ ఎడ్యుకేషన్ కమిషన్ కూడా ఏర్పాటుతోపాటు, రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గం ఇంటిగ్రేటెడ్ హాస్టల్ నిర్మాణానికి కూడా శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ, మైనారిటి హాస్టల్లో మరింత ప్రామాణికమైన ఆహారాన్ని అందించే కార్యక్రమంతో పాటు మెరుగైన విద్య బోధనా అవకాశాలను పెంపొందించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ఆదేశాలతో శనివారం నాడు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మొత్తం రాష్ట్రంలోని అన్ని గురుకుల సంక్షేమ హాస్టల్లో పర్యటించి పరిస్థితులను స్వయంగా సమీక్షించనుంది.

*ముఖ్యమంత్రి, మంత్రుల, పర్యటన వివరాలు* :

గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్ జిల్లాల లోని ఒక సంక్షేమ హాస్టల్ లో కామన్ డైట్ ప్లాన్ ను ప్రారంభిస్తారు., ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఖమ్మం జిల్లాలోని MJPBCWR JC (బాలికలు) మధిర బోనకల్ పాఠశాల లో కామన్ని డైయిట్ర్వ ప్రారంభిస్తారు.హించనున్నారు. మంత్రులు దామోదర రాజనరసింహ, డి. శ్రీధర్ బాబు లు , భూపాలపల్లి జిల్లాలోని ఘనపురం మండలం మైలారం లోని బాలికల MJPBCWR హాస్టల్ లోను, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం జిల్లాలోని మాదిరిపురం, తిరుమలాయపాలెం లోని TGTWR JC (బాలికలు), పొన్నం ప్రభాకర్,రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి హైదరాబాద్ లాలాపేట్ లోని సంక్షేమ హాస్టల్ లో కామన్ డైయిట్ ప్రారంభిస్తారు. కొండా సురేఖ సంగారెడ్డి జిల్లా హతనూర లోనూ, డి అనసూయ సీతక్క ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ ఆశ్రమ ఉన్నత పాఠశాల (బాలికలు) లో, తుమ్మల నాగేశ్వరరావు భద్రాద్రి కొత్తగూడం లోని దమ్మపేట మండలం గండుగులపల్లి ఏకలవ్య మోడల్ RI, TWD, లోనూ,జూపల్లి కృష్ణారావు నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ TGSWR JC(బాలికలు) లలో ఈ కామన్చ డైయిట్ను ప్రారంభించనున్నారు. ఈ సందర్బంగా రాష్ట్రం లోను అన్ని సంక్షేమ హాస్టళ్లలో ఈ క్రింద పేర్కొన్న విధంగా ఒకే విధమైన డైట్ ప్లాన్ ను అమలు చేస్తారు. రేపు ఉదయం 11 గంటలకు హాస్టళ్ల సందర్శన ఉంటుంది. ( సంక్షేమ హాస్టళ్లలో కామన్ డైయిట్ ప్లాన్ ఈ క్రింద జతపర్చనైనది. )

Leave A Reply

Your email address will not be published.

Breaking