జర్నలిస్ట్ సమస్యల పరిష్కారం కోసం కృషి- యాదాద్రి భువనగిరి జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ ఆవేస్ చిస్తీ
భువనగిరి, అక్షిత న్యూస్: జిల్లాలోని జర్నలిస్ట్ సమస్యల పరిష్కారం కోసం కృషిచేస్తానని యాదాద్రి భువనగిరి జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ ఆవేస్ చిస్తీ అన్నారు. భువనగిరి ప్రిన్స్ చౌరస్తాలో యాదాద్రి భువనగిరి ప్రెస్ క్లబ్ 2వ వార్షికోత్సవం సందర్భంగా కేకే కట్ చేసి ఆయన మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి దృష్టి కి తీసుకెళ్లి ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి కృషి చేస్తానని తెలిపారు. రాబోయే రోజుల్లో జర్నలిస్ట్ లకు ఇందిరమ్మ ఇల్లు కేటాయింపు,నా వంతు సహాయ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి గంధమల్ల రాజు,కోశాధికారి ఆరే కుమార్,ప్రచార కార్యదర్శి పాశం నవీన్ సభ్యులు కూరేళ్ల మల్లేశం,ఉదయ్ రెడ్డి, లక్ష్మీ నారాయణ, భువనగిరి కిషన్, షానుర్ బాబా, అఫ్జల్, జాకీర్, శివ, సురేష్, మహేష్ కుమార్, కూరెళ్ల శ్రీనివాసచారి శ్రీనివాస్, రషీద్, సుజావుద్దీన్.
