ప్రజావాణికి 128 ఫిర్యాదులు
అదనపు కలెక్టర్ అంకిత్
నిజామాబాద్, అక్షిత ప్రతినిధి :
జిల్లా కేంద్రంలో గల కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని, జిల్లాఅదనపు కలెక్టర్ అంకిత్ అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 128 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్ తో పాటు, డీఆర్డీఓ సాయగౌడ్, నిజామాబాద్ ఏసీపీ.రాజా వెంకట్ రెడ్డి లకు,విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా, అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.