యువత మేల్కొనాలి
రాజకీయ నాయకుల
మాటలు నమ్మకండి
*మా స్వార్థం కోసం యువత జీవితాలతో ఆడుకోవడం సరైనది కాదు
*యువి హోటల్ మేనేజ్మెంట్ సౌత్ క్యాంపస్ ప్రారంభోత్సవoలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
నిజామాబాద్, అక్షిత ప్రతినిధి :
ఉజ్వల భవిష్యత్తు కలిగిన యువత తమ చదువు వైపు, తమ భవిష్యత్తుపై వైపు దృష్టి పెట్టాలని, ముఖ్యంగా నేటి సమాజంలో రాజకీయ పార్టీల నాయకుల వ్యాఖ్యలు మాటలు విని మోసపోవద్దని ఆయన అన్నారు. తమ స్వార్థం కోసం రాజకీయాల్లో రాణించాలనే ఉద్దేశంతో తాము మాత్రం ఎమ్మెల్యేలు మంత్రులు, ఎంపీలు, తాము మాత్రం ఇతర రాజకీయ పదవుల్లో ఉంటామని యువత మాత్రం కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయ నాయకులకు గుర్తుకు వచ్చి వారిని పావులుగా వాడుకుంటామని ఆయన అన్నారు. మన స్వార్థం కోసం యువతను రెచ్చగొట్టి రోడ్లపై రాస్తారోకోలు, నిరసన కార్యక్రమాలు చేపట్టి కేసులు కోర్టుల చుట్టూ ఏళ్ల తరబడి తిరుగుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఇది సరైన పద్ధతినా అని ఒక్కసారి రాజకీయ నాయకులు ఆలోచించాలని ఆయన అన్నారు. యువి హోటల్ రాజకీయ నాయకులు మేనేజ్మెంట్ నిర్వాహకులు సృజన్ కుమార్ మంచి ఆలోచన చేశారని గ్రామీణ గ్రామీణస్థాయి యువతకు హోటల్ మేనేజ్మెంట్ ద్వారా విదేశాల్లో మంచి అవకాశాలు దక్కించుకోవచ్చు అని గ్రామిన స్థాయి యువతకు హోటల్ మేనేజ్మెంట్ ద్వారా విదేశాల్లో మంచి అవకాశాలు దక్కించుకోవచ్చు అనే ఆలోచనతో ఈ హోటల్ మేనేజ్మెంట్ను స్థాపించడం అభినందనీయమని అన్నారు. దయచేసి నేటి యువత చెడు మార్గాన పోకుండా డ్రగ్స్, గంజాయి, మద్యానికి దూరంగా ఉండి రాజకీయ నాయకుల మాటలు వినకుండా తమ చదువు మీద దృష్టి పెట్టి ప్రజాసేవకు అంకితం కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయనను హోటల్ మేనేజ్మెంట్ కళాశాల యాజమాన్యం ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నరాల రత్నాకర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి తదితరులు, పాల్గొన్నారు.