ఆత్మకూరు (ఎం)మండలంలో గెలుపొందిన సర్పంచులు వీరే
ఆత్మకూర్(ఎం), అక్షిత న్యూస్ :
23 గ్రామ పంచాయతీలకు గాను ఉప్పలపాడు, రాయిపల్లి సర్పంచ్ అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు. మిగతా 21 గ్రామపంచాయతీ ఎన్నికలలో మండలంలోని సర్వపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కల్వకుంట్ల ఉపేందర్ రెడ్డి 267 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. సారగండ్లగూడెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి సారగండ్ల చలమయ్య 165 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

మోదుగుంట గ్రామంలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి సోలిపురం ఎల్లారెడ్డి 41 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రాఘవపురం గ్రామంలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ఎరుకల యతీశ్వర్ గౌడ్ 200 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కొరటికల్ గ్రామంలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి కట్టేకోలా సుశీలమ్మ 240 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. పుల్లాయిగూడెం గ్రామంలో బిజెపి బలపరిచిన అభ్యర్థి నరముల లింగయ్య 41 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తిమ్మాపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొసన. లక్ష్మి కిష్టయ్య 27 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. పోతిరెడ్డిపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నాగుల సత్యనారాయణ యాదవ్ 139 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. సింగారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పన్నాల వనజ 38 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. పారుపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దెయ్యాల మాధవి 274 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మొరిపిరాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి అంబోజు ధనమ్మ శంకరయ్య 117 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. పల్లెపాడు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సుంకరి మంజుల 131 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మోదుబావిగూడెం గ్రామంలో టిఆర్ఎస్ అభ్యర్థి కట్టేకోల శ్రీహరి 3 మెజార్టీతో గెలుపొందారు. కప్రాయిపల్లి గ్రామంలో కొంగరి యాదగిరి 304 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. టి.రేపాక గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి బండ శ్రీను 305 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. పల్లెర్ల గ్రామంలో తండ మంజుల 517 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తుక్కాపురం గ్రామంలో బిఆర్ఎస్ అభ్యర్థి సంఘపాక శ్రీవాణి 101 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. లింగరాజు పల్లి గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎర్ర సోమిరెడ్డి 107 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రహీంఖాన్ పేట గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి సుదగాని కళావతి లింగయ్య 320 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆత్మకూర్ బీసు ధనలక్ష్మి 148 ఓట్లతో గెలుపొందారు…