వరంగల్, అక్షిత బ్యూరో: వరంగల్ మామూనూర్ నాల్గవ పటాలంలో అధికారులు, సిబ్బంది కోసం నూతనంగా నిర్మించిన గృహ సముదాయంతో పాటు బ్యాట్మెంటన్ క్రీడ ఆడిటోరియాన్ని ప్రారంభించేందుకు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర పోలీస్ డిజిపి బి. శివధర్ రెడ్డిని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ మర్యాద పూర్వకంగా కలుసుకొని మొక్కను అందజేశారు. డిజిపిని కలసినవారిలో వరంగల్ కమిషనరేట్ డీసీపీలు అంకిత్ కుమార్, రాజమహేంద్ర నాయక్, దార కవిత, మామూనూర్ ఏసీపీ వెంకటేష్ లు పాల్గొన్నారు.