
యువజన కాంగ్రెస్ పోరాట ఫలితమే
ఎస్సై కానిస్టేబుల్ పరిక్షలో 7 మార్కులు కలిపారు
-జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు యడ్లపల్లి సంతోష్
ఖమ్మం/ అక్షిత బ్యూరో :
యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో గత రెండు నెలల పోరాటంతో ఎస్సై కానిస్టేబుల్ పరీక్ష లో జరిగిన తప్పులను ఎండకడుతూ అభ్యర్థుల పక్షానా యువజన కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్తంగా అనేక విధాలుగా నిరసన తెలపడం జరిగింది.ఎట్టకేలకు యువజన కాంగ్రెస్ పోరాటానికి దిగి వచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తీర్పును అమలు పరుస్తూ 7 మార్కులు కలిపి మెయిన్స్ కు అనుమతి ఇచ్చారు.ఈ నిర్ణయం వల్ల దాదాపు 60000 వేల పై మంది అభ్యర్థులకు న్యాయం జరుగుతుంది అని యడ్లపల్లి సంతోష్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పులు కొంత మేర సరిచేసుకున్నా దేశంలో ఎక్కడా లేని విధంగా నిబంధనలు పెట్టిన ముఖ్య మంత్రి కేసిఆర్ ను నిరుద్యోగ యువత క్షమించదు అని అన్నారు.