యాసంగిలో నమోదు చేసిన పంటలకు వెరిఫికేషన్
– సహాయ సంచాలకులు డి ఎల్లయ్య
నాంపల్లి, అక్షిత న్యూస్:
మండలంలోని బండతిమ్మాపురం గ్రామంలో మునుగోడు సహాయ సంచాలకులు డి ఎల్లయ్య పంటలను పరిశీలించడం జరిగింది ఇందులో భాగంగా వరి,వేరుశనగ,బత్తాయి,నిమ్మ మామిడి, తోటలు ఇతర పంటలను సర్వే నెంబర్ల వారీగా వెరిఫికేషన్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఏఈఓ నవీన్ మరియు తదితర రైతులు పాల్గొనడం జరిగింది.