77 వ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన.మాదిరెడ్డి యుగంధర్ రెడ్డి.
కూకట్ పల్లి, అక్షిత ప్రతినిధి:
77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో భాగంగా కూకట్ పల్లి నియోజకవర్గం బాలానగర్ 120 డివిజన్ ఫిరోజగుడా లో (అరుంధతి అపార్ట్మెంట్స్) దగ్గర ఏర్పాటు చేసిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై జెండాను ఆవిష్కరించిన కూకట్ పల్లి నియోజకవర్గ ఏ.బ్లాక్ ఉపాధ్యక్షుడు మాదిరెడ్డి యుగంధర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో వై.డబ్ల.ఏ అసోసియేషన్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ బాలానగర్ డివిజన్ ఉపాధ్యక్షులు ఆకుల నరేందర్, ముఖ్తర్ అహ్మద్, కార్యకర్తలు, నాయకులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.