నిడమనూరు యూత్ కాంగ్రెస్ కార్యదర్శిగా శ్యామ్
కాంగ్రెస్ పటిష్టతకు కృషి
నిడమనూరు, అక్షిత న్యూస్ :
నిడమనూరు యూత్ కాంగ్రెస్ కార్యదర్శిగా శ్యామ్ నియమితులయ్యారు. మాజీ మంత్రి, కాంగ్రెస్ దిగ్గజం కుందూరు జానారెడ్డి ఆదేశాల మేరకు యూత్ కాంగ్రెస్ ను మరింత పటిష్ఠ వంతం చేసేందుకు నూతన కార్యవర్గాన్ని నియమించింది. నిడమనూరు
కాంగ్రెస్ యూత్ నియోజకవర్గ స్థాయి కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. కుందూరు జానారెడ్డి ఆదేశాను మేరకు
నిడమనూరుకు చెందిన కోల శ్యామ్ ను నియోజకవర్గ యూత్ కార్యదర్శిగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గౌని రాజా రమేష్ , నాగార్జునసాగర్ యూత్ కాంగ్రెస్ నాగరాజు, నియోజక వర్గస్థాయి నాయకులు మేరెడ్డి వివేక్, పురుషోత్తంరెడ్డి, పవన్ తదితరులు పాల్గొన్నారు.