కాలనీ సమస్యలు, అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరిన కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు
వనస్థలిపురం,అక్షిత ప్రతినిధి:

బి .యన్ .రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని టీచర్స్ కాలనీ సర్వేనెంబర్ 33 మరియు సర్వేనెంబర్ 59 లోనీ కాలనీ సభ్యులు నూతన కాలనీ సంక్షేమ సంఘం ఏర్పరచుకున్న సందర్భంగా గురువారం బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ జి హెచ్ ఎం సి కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది మరియు కాలనీలోని సమస్యల పరిష్కారానికి , అభివృద్ధికి నిధులు మంజూరు చేసేలా కృషి చేయాలి అని కాలనీవాసులు కోరడం జరిగింది..
స్పందించిన కార్పొరేటర్ కాలనీ లో ఒకటి ఒకటిగా ప్రతి సమస్య పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తానని కాలనీ వాసులకు హామీ ఇవ్వడం జరిగింది.