సంపత్ రెడ్డిని చూసి వెక్కి వెక్కి ఏడ్చిన పల్లా
–కంటతడి పెట్టిన జనగామ ఎమ్మెల్యే పల్లా
జనగామ, అక్షిత ప్రతినిధి:
జనగామ జిల్లా చిలుపూర్ మండలం రాజవరం గ్రామానికి చెందిన జనగామ జిల్లా పార్టీ అధ్యక్షులు, జడ్పి చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి సోమవారం ఆకస్మికంగా గుండె పోటుతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న వెంటనే హైదరాబాద్ నుంచి హుటాహుటిన జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అక్కడికి చేరుకున్నారు..

వారు సంపత్ రెడ్డి పార్థివ దేహంపై పూలమాల వేసి నివాళులు అర్పించారు. దింతో సంపత్ రెడ్డి మృతి దేహాన్ని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి చూసి ఏడుపు ఆపుకోలేకపోయారు.. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు.