బిఎన్.ఆర్కె ఎస్ పట్టణ కమిటీ ఎన్నిక
అధ్యక్షులుగా చెప్పాలా మధు రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక…
జనగామ, అక్షిత ప్రతినిధి:
జనగామ జిల్లా బచ్చన్నపేట మండలలోని స్థానిక భవన కార్మికుల భవనంలో భవన నిర్మాణ కార్మిక సంఘం నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది బచ్చన్నపేట టౌన్ అధ్యక్షులుగా చెప్పాలా మధురెడ్డి, ఉపాధ్యక్షులుగా కుక్కుడాల పుల్లయ్య, ప్రధాన కార్యదర్శిగా రాగిర్ మురళి, సహాయ కార్యదర్శిగా గంధమల్ల నరేష్, కోశాధికారి కుక్కుడాల పాండురంగం, ఆర్గనైజర్ గా టేకులపల్లి సంపత్, సలహాదారులుగా అల్వాల ఎల్లయ్య , అల్వాల రాజు, ఎద్దు ప్రభాకర్, రాగిరిసిద్దులు, కర్రే లక్ష్మీనారాయణ లను, ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో బి ఎన్ ఆర్ కే ఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఎద్దు నాగయ్య, మాజీ టౌన్ అధ్యక్షులు రాగిశెట్టి అబ్బ సాయిలు, ఇరుగు మహేందర్, జంజాల ఉపేందర్, గుడ్ల మనోహర్, అల్వాల ఉప్పలయ్య, భామండ్లపల్లి బాలరాజ్, రాగీరు శ్రీనివాస్, ఎద్దు మోహన్, చెక్క పాండు, కర్రె రవికుమార్, రాగిశెట్టి సిద్ధులు, గౌటి అనిల్, కొన్నే జయరాజ్, అల్వాల నాగరాజు, రాగిశెట్టి కిషన్, జంపయ్య, కిష్టయ్య, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.