కొమురవెల్లి మండలంలో కాంగ్రెస్ జెండా ఎగరాలి
ముఖ్య కార్యకర్తల సమావేశం
కొమురవెల్లి, అక్షిత న్యూస్:
జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జనగామ నియోజకవర్గ ఇన్చార్జ్ కొమ్మూరి ప్రతాపరెడ్డి ఆదేశాల మేరకు కొమురవెల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహాదేవుని శ్రీనివాస్ ఆధ్వర్యంలో గురువన్నపేట, తపాస్పల్లి, రసులాబాద్ గ్రామాల్లో త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో సమరానికి అందరూ సిద్ధంగా ఉండాలని రిజర్వేషన్ ఎవరికి వచ్చిన ప్రజా పాలన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజల సంక్షేమ పథకాలు ప్రజల వద్దకు చేర్చాలని అలాగే గడపగడపకి తీసుకువెళ్లాలని కోరడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, మండల నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు వివిధ గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులు, మాజీ సర్పంచ్లు,మాజీఎంపీటీసీలు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు,కార్యకర్తలు, పాల్గొన్నారు.