కొండమల్లేపల్లి, అక్షిత ప్రతినిధి: బ్యాంకులు అందిస్తున్న వివిధ రకాల సేవలను బ్యాంకు ఖాతాదా రులు సద్వినియోగం చేసుకో వాలని తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంకు జిల్లా రీజినల్ మేనేజర్ విజయభాస్కర్ గౌడ్ గ్రామ ప్రజలకు తెలిపా రు. బ్యాంకు కొండమల్లేపల్లి శాఖ, సి ఎఫ్ ఎల్ ఆధ్వర్యం లో శనివారం మండలంలోని దేవరోని తండా లో బ్యాంకు లు అందిస్తున్న వివిధ రకాల సేవలపై ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా తక్కువ ప్రీమి యంతో అందిస్తున్న వివిధ రకాల బీమా పాలసీల గు రించి విపులంగా వివరించా రు.అనంతరం బ్యాంకు ఖాతాదారుడు మోతీలాల్ ఇటీవల మృతి చెందగా అతనికి మం జూరైన బీమా పాలసీ నగదు రెండు లక్షల రూపాయల చెక్కును అతని భార్య పద్మకు అందజేశా రు.ఈ కార్యక్రమంలోబ్యాంకు నల్గొండ జిల్లా రీజనల్ మేనేజర్ విజయ భాస్కర్ గౌడ్, చీఫ్ మేనేజర్ దేవేం దర్, కొండ మల్లేపల్లి శాఖ మేనేజర్ చంద్ర శేఖర్, రాజశేఖర్, సతీష్, అభి లాష్, సి ఎఫ్ ఎల్ కౌన్సిలర్ అంకులమ్మ, మహేష్, హేమ, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.