మెగారక్తదాన శిబిరం : సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్
సత్తుపల్లి, అక్షిత న్యూస్ :
సత్తుపల్లి జలగం వెంగళరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో నిర్వాహకులు బ్రహ్మ కుమారి సమాజ సంఘసేవకుల ఆధ్వర్యంలో విశ్వ బంధుత్వ దినోత్సవ సందర్బంగా మెగా రక్త దాన శిబరంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మట్టా దయానంద్ విజయ్ కుమార్ తో కలిసి పాల్గొన్నారు సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్.రక్తందానం వలన అనారోగ్యంతో లేదా ప్రమాదంలో గాయపడి ఆపదలో వున్నవారి ప్రాణాలు కాపాడటం కోసం ఉపయోగపడుతుంది అని అది ఎంతో మంచి ఆలోచన అని దీన్ని ఏర్పాటు చేసిన బ్రహ్మ కుమారి సమాజ సంఘం సేవకుల బృందాన్ని మరియు రక్త దానం చేసిన పలువురు దాతలను ఎమ్మెల్యే అభినందించటం జరిగింది.

ఈ కార్యక్రమం లో సత్తుపల్లి నియోజకవర్గం నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.