రంగంపేట పీఠాధిపతి శ్రీ మాధవానంద స్వామితో జగ్గారెడ్డి
సంగారెడ్డి రాంనగర్ రామ్
మందిర్లో ఆశ్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై సమీక్ష, సూచనలు
త్వరితగతిన ఆశ్రమానికి సంబంధించిన పనులు పూర్తి చేయాలని ఆదేశం
మెదక్, అక్షిత బ్యూరో:
రంగంపేట పీఠాధిపతి శ్రీ మాధవానంద స్వామి తో కలిసి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి రామ్ నగర్ రామ్ మందిర్ లో చర్చించారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న ఆశ్రమంలో చేయాల్సిన ఏర్పాట్ల గురించి సమీక్షిస్తూ, అవసరమైన సూచనలు చేశారు. ఆశ్రమంలో అన్ని రకాల వసతులు సమకూర్చేలా అవసరమైన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సత్తన్న, నారాయణ, తోపాజీ అనంత కిషన్, పవన్ పంతులు, కూన సంతోష్, కిరణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.