నేడే తల్లాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచితంగా హెల్త్ క్యాంప్
మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్న డాక్టర్ ప్రత్యూష.
సత్తుపల్లి, అక్షిత న్యూస్:
మార్చి నెల 31న మంగళవారం అంటే నేడే తల్లాడ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచితంగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు డాక్టర్ ప్రత్యూష తెలిపారు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి నుండి ప్రముఖ స్పెషలిస్ట్ డాక్టర్లు హాజరవుతారని,పలు అనారోగ్య సమస్యలు, గైనకాలజీసమస్యలు, కీళ్ల నొప్పులు, చిన్నపిల్లల చికిత్స, సాధారణ వ్యాధులు, కంటి సమస్యలు, టీబీ లక్షణాల పరిశీలన, ఉచిత రక్త పరీక్షలు, ఉచిత మందులుపంపిణీచేస్తామని ఈ అవకాశాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ కోరారు.