వికారాబాద్ కలెక్టరేట్ లో ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు
వికారాబాద్: అక్షిత బ్యూరో,
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఆఫీసులో వాసవి మాత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వైశాఖ శుక్ల పక్ష శతమి నాడు వాసవి మాతా జయంతి ఉత్సవాలను రాష్ట్ర కార్యక్రమంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన సందర్బంగా వాసవి మాతా జయంతి ఉత్సవలను ఆదివారం అదనపు కలెక్టర్ స్థానిక సంస్తలు ఉమా శంకర్ ప్రసాద్ జ్యోతి ప్రజ్వలన గావించి పూలమాల అలంకరించారు.ఈ కార్యక్రమం లో క్రీడాల అభివృద్ధి అధికారి సత్తార్, వైశ్య సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.