బి.యన్.రెడ్డి .నగర్ డివిజన్ నుండి
బి.ఆర్.ఎస్.పార్టీలోకి భారీగా చేరికలు
వనస్థలిపురం, అక్షిత ప్రతినిధి:
ఎల్బీనగర్ గౌరవ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గత 5 సంవత్సరాలుగా నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై బి.ఎన్.రెడ్డి. నగర్ డివిజన్ సాహెబ్ నగర్ గ్రామం నుండి గ్రామ వాస్తవ్యులు నీళ్ల రాజశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో డివిజన్ అధ్యక్షులు కటికరెడ్డి అరవింద్ రెడ్డి అధ్యక్షతన శనివారం బి.ఆర్.ఎస్. పార్టీలో 50 మంది యువకులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరడం జరిగింది.యువకులకు బి ఆర్ ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించి రానున్న ఎన్నికల్లో టి ఆర్ ఎస్ పార్టీకి భారీ మెజార్టీ వచ్చే విధంగా కృషి చేయాల ని వారిని కోరడమైనది. ఇట్టి కార్యక్రమంలో బి .ఎన్. రెడ్డి. నగర్ డివిజన్ బి ఆర్ ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు గడ్డం మల్లేష్ గౌడ్ మరియు చేరిక అయిన వారిలో దండు సుధాకర్ యాదవ్ ,అశోక్ నాయుడు ,లయన్ రాజు , సునీల్, రాఘవేందర్ రావు,జగన్, హరిబాబు మరియు యువ నాయకులు పార్టీలో చేరడం జరిగింది.